బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా ఛప్రా నగరానికి సమీపంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. అక్రమ పటాకుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సరన్ ఎస్పీ సంతోష్కుమార్ తెలిపారు.
మూడంతస్తుల బిల్డింగ్లోని ఒక పోర్షన్లో అక్రమంగా పటాకులు తయారీ చేస్తున్నారు. గంటసేపు పేలుళ్ల శబ్దం వినిపిస్తూనే ఉందని స్థానికులు తెలిపారు. భారీ పేలుడు జరగడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగాయని, బిల్డింగ్లో చాలాభాగం కుప్పకూలిందని ఎస్పీ సంతోష్కుమార్ వెల్లడించారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను రప్పించామని చెప్పారు.