ఇడుక్కి: కేరళలోని ముల్లపెరియార్ డ్యామ్(Mullaperiyar dam) గేట్లను రేపు తెరవనున్నారు. స్పిల్వే ద్వారా నీటిని డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ డ్యామ్లో నీటి మట్టం 137.50 ఫీట్ల ఎత్తుకు చేరుకున్నది. ఇక డ్యామ్లోకి దాదాపు 12 వేల క్యూసెక్కుల నీరు చేరుకున్నది. దీంతో అధికారులు డ్యామ్ గేట్లు తెరవాలని నిర్ణయించారు. ఇటీవల క్యాచ్మెంట్ ఏరియాలో ఏకధాటిగా వర్షాలు పడడం వల్ల.. డ్యామ్లోకి భారీగా నీరు ప్రవహిస్తోంది. ముల్లపెరియార్ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. వేర్వేరు దశల్లో గేట్లను తెరవనున్నారు. ఉదయం 10 గంటల నుంచి స్పిల్వే ద్వారా వెయ్యి కూసెక్కుల నీటిని రిలీజ్ చేయనున్నారు. ఇడుక్కి జిల్లా కలెక్టర్ షీబా జార్జ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 125 ఏళ్ల క్రితం నాటి ఆ డ్యామ్లో పూర్తి నీటి స్థాయి సామర్థ్యం 142 ఫీట్లు.