న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ములాయం ఐసీయూలోనే ఉన్నారు. పలు రకాల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ములాయం సింగ్కు చికిత్స కొనసాగిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ములాయం కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీన ఆయనను ఐసీయూకు తరలించారు.
ములాయం భార్య సాద్నా గుప్తా ఈ ఏడాది జులై నెలలో మరణించిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న గుప్తా.. గురుగ్రామ్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ములాయం మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా సేవలందించారు. యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 10 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మెయిన్పురి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీగా కొనసాగడం ఇది ఏడోసారి. ములాయం సింగ్ యాదవ్ పొలిటికల్ సైన్స్లో పీజీ పట్టా పుచ్చుకున్నారు.