Anant Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. గుజరాతీ సంప్రదాయమైన గోల్ ధన, చునారివిధి వంటి కార్యక్రమాలతో ఈ నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ భావోధ్వేగానికి గురయ్యారు.
వేడుకలో భాగంగా ఈషా అంబానీ.. రాధికా గురించి మాట్లాడాలంటూ తన నానమ్మ అయిన కోకిలా బెన్ను స్టేజ్పైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోకిలాబెన్ తాను చాలా అదృష్టవంతురాలిని అంటూ ఎమోషనల్గా స్పందించారు. ‘నేను చాలా లక్కీ. శ్లోకా మోహతా (ఆకాశ్ అంబానీ వైఫ్), ఈ షా అంబానీ, రాధికా మర్చంట్లు నాతో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా, అనంత్-రాధికాల ఎంగేజ్మెంట్ వేడుక ముంబైలోని అంబానీ నివాసం ఆంటీలియాలో ఈనెల 19వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు అంబానీ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.