ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 46వ వార్షిక సాధారణ సమావేశం (AGM) లో రిలయన్స్ ఫౌండేషన్ (RF) చైర్పర్సన్ నీతా అంబానీ రిలయన్స్ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)’ ప్రారంభం, రిలయన్స్ ఫౌండేషన్ కార్యక్రమాల ప్రకటన సందర్భంగా సమావేశంలో నీతా అంబానీ దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆమె బనారసీ జరి చీరలో మెరిశారు. ప్రముఖ చేనేత కళాకారుడు శ్రీ ఇక్బాల్ అహ్మద్ ఆ చీరను చేతితో నేశాడు. ఈ అద్భుతమైన నేత చీర వందల ఏళ్ల నాటి వారణాసి చేనేత కళ గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. బర్ఫీ బూటీ, కొనియా పైస్లీ పద్ధతులు, సంప్రదాయ జరీ వర్క్తో భారతదేశ చేనేత కళ వైవిధ్యాన్ని ఈ బనారసీ జరి చీర డిజైన్ చాటిచెబుతున్నది.
భారతదేశపు సంప్రదాయ హస్తకళలను కాపాడటం, ప్రోత్సహించడం లక్ష్యంగా రిలయన్స్ ఫౌండేషన్ తీసుకొచ్చిన ‘స్వదేశ్ (SWADESH)’ కార్యక్రమం మద్దతిస్తున్న ప్రాంతీయ కళారూపాల్లో ఈ బనారసీ నేత కూడా ఒకటిగా ఉన్నది. బనారసీ జరీ చీరలో కనిపించడం ద్వారా నీతా అంబానీ చేనేత కళాకారులకు, ఈ కళను తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న చేనేత కళ వారసత్వానికి ఘన నివాళులు అర్పించారు.