న్యూఢిల్లీ, జూన్ 13: బీస్ట్ ఫిలాంత్రపీ ఛానల్ స్థాపకుడు మిస్టర్ బీస్ట్ 50 కోట్ల సబ్స్ర్కైబర్లతో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే నెం.1 యూట్యూబర్గా పేరొందిన మిస్టర్ బీస్ట్ ఈ నెల 12న 50 కోట్ల సబ్స్ర్కైబర్ల మైలురాయిని అధిగమించాడు. 13 ఏండ్ల వయసులో 2017లో యూట్యూబ్ ఛానల్ స్థాపించిన బీస్ట్ అసలు పేరు జేమ్స్ డొనాల్డ్సన్.
అతడు తన ఛానల్పై వచ్చే మొత్తం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నాడు. ‘ఘనా మేక్ ఎ డిఫరెన్స్’ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి గుండె జబ్బులున్న పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించేందుకు అత్యాధునిక సర్జికల్ సెంటర్ను ప్రారంభించాడు.