న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలును నడపాలంటూ ఇవాళ లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఎంఎంటీఎస్ రైళ్లు చాలా కీలకమైనవని, మధ్యతరగతి ప్రజలు ఈ రైళ్లతో తక్కువ ధరలో ప్రయాణిస్తారన్నారు. వికారాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను కలిపేందుకు రైల్వే లైన్ పనులు చేపట్టాలని ఆయన కోరారు. వికారాబాద్కు ఎంఎంటీఎస్ సేవలను పొడిగించడం వల్ల ఆ పట్టణం ఆర్థికంగా బలపడుతుందన్నారు. అక్కడ హౌజింగ్ వృద్ధి చెందుతుందన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్తో ఎంఎంటీఎస్ను లింకు చేయాలన్నారు. మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టును 2004లో స్టార్ట్ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు.