భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఠాకూర్లుగానూ వ్యవహరించే రాజ్పుట్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ మహిళలను ఇండ్ల నుంచి బయటకి లాగి వారితో పని చేయించాలని అన్నారు. మంత్రి వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అనుప్పుర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఠాకూర్లతో పాటు ఇతర అగ్ర కులాలు తమ మహిళలను ఇండ్లకు పరిమితం చేశాయి..సమాజంలో పనిచేసేందుకు వారిని అనుమతించడం లేదు..సమానత్వం సాధించేందుకు ఠాకూర్లతో పాటు ఇతర అగ్రకులాల మహిళలను ఇండ్లనుంచి బయటకు లాగి వారితో పని చేయించాల”ని సింగ్ ఆ వీడియోలో అన్నారు.