న్యూఢిల్లీ: ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) అనైతిక ప్రవర్తనకు పాల్పడిందని, పార్లమెంట్ ఐడీ, పాస్వర్డ్లను గుర్తు తెలియని వ్యక్తులతో షేర్ చేసుకున్నదని, అందుకు ఆమెను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇవాళ లోక్సభలో చర్చ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ అంశంపై ఓటింగ్ చేపట్టిన స్పీకర్ బిర్లా.. ఎంపీ మహువాను హౌజ్ నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. ఆ తర్వాత లోక్సభ సోమవారానికి వాయిదా పడింది.
#WATCH | Mahua Moitra leaves from Parliament after her expulsion as TMC MP pic.twitter.com/MY8tZLsRTm
— ANI (@ANI) December 8, 2023
పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఎంపీ మహువాపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ రిపోర్టుపై చర్చ జరిగింది. ఆ తర్వాత మహువాను తొలగిస్తూ తీర్మానం చేశారు. తీర్మానానికి ఓకే చెప్పడంతో.. ప్రతిపక్షాలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేపట్టాయి. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే .. ఎంపీ మహువాపై చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది.
#WATCH | Mahua Moitra on her expulsion as a Member of the Lok Sabha says, “…If this Modi government thought that by shutting me up they could do away with the Adani issue, let me tell you this that this kangaroo court has only shown to all of India that the haste and the abuse… pic.twitter.com/DKBnnO4Q0d
— ANI (@ANI) December 8, 2023