న్యూఢిల్లీ: మహిళల్లో కలిగే నెలసరి సమస్యలపై ఇవాళ లోక్సభలో ఎంపీ చింతా అనురాధ మాట్లాడారు. పబ్లిక్, ప్రైవేటు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యవసర అంశాలపై ఆమె ఇవాళ సభలో మాట్లాడుతూ.. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు రెండో రోజుల లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెలసరికి సంబంధించిన లీవ్ల అంశం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉందని, మెన్సెస్ సమస్యలతో ఎంతో మంది మహిళలు బాధపడుతుంటారని, ఒవేరియన్ సిస్ట్ లాంటి సమస్యలతోనూ అనేక మంది మహిళలు ఇబ్బందిపడుతుంటారని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో మెన్స్ట్రువల్ లీవ్ రూపంలో పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. లీవ్ ఇవ్వడం వల్ల మహిళలకు కావాల్సిన రెస్ట్ దొరుకుతుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు తప్పనిసరిగా రెండు రోజుల నెలసరి లీవ్లు ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖను ఎంపీ అనురాధ కోరారు.