న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ఉత్తర ప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ నియోజకవర్గంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆయన శుక్రవారం పర్యటించారని జిల్లా కలెక్టర్ నేహా శర్మ చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న సమయంలో ఆయన పర్యటించారని, ఆయన వాహన శ్రేణిలో 25-30 వాహనాలు ఉన్నాయని తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన బ్రిజ్ భూషణ్పై కాట్రా మార్కెట్ ఏరియాలోని ఫ్లయింగ్ స్కాడ్ ఇన్ఛార్జి డాక్టర్ నజ్ముల్ ఇస్లామ్ ఖర్గుపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనిపై కేసును నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కైసర్గంజ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు.