బెంగళూరు, సెప్టెంబర్ 18: చీతాలే కాదు.. విదేశాలకు పారిపోయిన చీటర్లను ఎప్పుడు తీసుకొస్తారని ప్రధాని మోదీని సినీనటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ‘అడవుల్లో తిరిగే చీతాలను రప్పించారు.. మరి బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన చీటర్లను ఎప్పుడు తీసుకొస్తారు’ అని నిలదీశారు. జస్ట్ అడుగుతున్నా! అంటూ ఆదివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. తాను చెప్పే చీతాలు ఇవేనంటూ విజయ్ మాల్యా, నీరవ్మోదీ, మోహుల్ చోక్సీల ఫొటోలను ట్వీట్కు జతచేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది.