కాన్పూర్ : రైలు ప్రయాణంలో చిన్నారి గుక్కపట్టి ఏడేస్తోంది.. పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్ చేసింది. ఈ మేరకు తక్షణం స్పందించిన రైల్వేశాఖ పాలు అందించి చిన్నారి ఆకలి తీర్చింది. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్పూర్కు చెందిన అంజలీ తివారీ అనే మహిళ లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి ఎల్టీటీ (12143) ట్రైన్ ఏసీ కోచ్లో ఇద్దరు బయలుదేరింది. రైలు మధ్యాహ్నం 2.30 గంటలకు భీమ్సేన్ స్టేషన్కు చేరుతుండగా.. ఈ క్రమంలో ఎనిమిది నెలల పాప ఆకలితో ఏడవడం ప్రారంభించింది. ఎంత సముదాయించినా చిన్నారి ఏడుపు ఆపలేదు. చివరకు చేసేది లేక అంజలి ‘పాప ఏడుస్తోందని.. పాలు కావాలంటూ’ 2.52 గంటల ప్రాంతంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీకుమార్కు ట్వీట్ చేసింది.
వెంటనే స్పందించిన రైల్వేశాఖ పాపకు పాలు అందించేందుకు ఏర్పాటు చేసింది. ట్వీట్ చేసిన సమయానికి అప్పటికే రైలు భీమ్సేన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ట్వీట్ చేసిన 23 నిమిషాల కాన్పూర్ సెంట్రల్ రైల్వేస్టేషన్లోని తొమ్మిదో నంబర్ ఫ్లాట్ఫాంపైకి రైలు 3.15 గంటలకు చేరిన అనంతరం రైల్వే సిబ్బంది పాలు అందించారు. కాన్పూర్ డిప్యూటీ సీటీఎం హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ఏసీఎం సంతోష్ త్రిపాఠి చిన్నారికి పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రైల్వేశాఖకు అంజలి కృత్ఞతలు తెలిపింది. ఆ తర్వాత రైలు కాన్పూర్ నుంచి సుల్తాన్పూర్కు ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ట్వీట్కు స్పందించి చిన్నారి ఆకలి తీర్చినందుకు రైల్వేశాఖకు నెటిజన్లు సైతం ధన్యవాదాలు తెలుపుతున్నారు.