న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి మీనాక్షీ లేఖి ఇవాళ సైకిల్ తొక్కారు. దౌత్యవేత్తలు, రాయబారులతో కలిసి ఆమె ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే సైక్లింగ్, పెడలింగ్ను ఎంకరేజ్ చేయాలని ఆమె అన్నారు. పర్యావరణం కూడా మెరుగవుతుందన్నారు. మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడ్రన్ ఆర్ట్కు సైకింగ్ చేశారు.