లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ భౌతికకాయం సోమవారం సాయంత్రం తన స్వగ్రామం సాయ్ఫాయ్కి చేరుకుంది. ఈ ఉదయం గరుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ములాయం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రిలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా స్వగ్రామానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు.
మంగళవారం ములాయం అంత్యక్రియలు జరుగనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. కేంద్ర రాజకీయాల్లో సుధీర్ఘకాలం చక్రం తిప్పిన ములాయం అంత్యక్రియలకు దేశ నలుమూలల నుంచి నేతలు భారీగా తరలి రానున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తదితరులు ఇప్పటికే తాము స్వయంగా అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు. అంత్యక్రియలకు ప్రజలు, అభిమానులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.