భువనేశ్వర్: బిజూ జనతాదళ్ తరపున రానున్న ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 10 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారట! ‘చాలా మంది వృత్తి నిపుణులతో కలిపి 10 వేల మందికిపైగా మా పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు’ అని బీజేడీ నేత ప్రణబ్ ప్రకాశ్ దాస్ మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల దీవెనలతో బీజేడీ చారిత్రక విజయాన్ని సాధిస్తుందని బలంగా నమ్ముతున్నామని తెలిపారు.