Gang War | పంజాబ్ (Punjab)లోని గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఆదివారం గ్యాంగ్వార్ (Gang War) జరిగింది. ఇరువర్గాల ఘర్షణలో దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలా (singer Sidhu Moosewala) హత్య కేసులో నిందితులు ఇద్దరు మృతి చెందారు. తరన్ తారణ్ జిల్లా (Tarn Taran district) గోయింద్వాల్ సాహిబ్ జైలు ( Goindwal Sahib Central Jail)లో జరిగిన గ్యాంగ్ వార్లో ఇద్దరు మృతి చెందారని, మరొకరు గాయపడ్డారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ (Gurmeet Singh Chauhan) పేర్కొన్నారు. ముగ్గురూ ఒకే వర్గానికి చెందిన వారని తెలిపారు.
మృతులను బటాలాకు చెందిన మన్దీప్ సింగ్ అలియాస్ తూఫాన్, బుధ్లాడ నివాసి మన్మోహన్ సింగ్ అలియాస్ మోహ్నగా గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘర్షణలో గాయపడ్డ మరో ఖైదీ కేశవ్ అని పేర్కొన్నారు. గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఖైదీల మధ్య ఏదో విషయంలో గొడవ జరిగిందని, కొద్దిసేపటికే పరిస్థితి అదుపు తప్పిందన్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులో గ్యాంగ్ వార్ జరిగిన సమయంలో పాత్రలు, ఇనుప రాడ్లు వినియోగించారని పేర్కొన్నారు.
‘సిద్ధూ మూసేవాలా’గా పేరుపొందిన శుభ్దీప్ సింగ్ సిద్ధూ గతేడాది మే 29న మాన్సా జిల్లాలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మన్దీప్ సింగ్, మోహనా, కేశవ్ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది 29న సిద్ధూ మూసేవాలాపై దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్యకు తామే బాధ్యులమని ప్రకటించింది. సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన సమయంలో మన్దీప్ తుఫాన్ అక్కడే ఉండగా.. స్టాండ్బై షూటర్గా తీసుకెళ్లారు. సిద్ధూ మూసేవాలాపై కాల్పులు జరిపిన జగ్రూప్, మన్ప్రీత్ మన్నూ వెంట ఉన్నాడు.
రెక్కీలు నిర్వహిస్తూ ఆ సమాచారాన్ని కెనడాలో ఉన్న గోల్డీ బ్రార్కు మన్ప్రీత్ పంపేవాడు. ఈ మేరకు సిద్ధూ మూసేవాలా హత్యకు అతను ప్రణాళిక వేశాడు. మూసేవాలా హత్య అనంతరం.. మన్ప్రీత్, మన్మోహన్ ఇద్దరూ అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. లూధియానాకు చెందిన సందీప్ అనే వ్యక్తి వీరిద్దరికీ ఆశ్రయం ఇచ్చాడు. ఆ తర్వాత సందీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత మన్ప్రీత్, మన్మోహన్ సైతం పోలీసులకు చిక్కారు.