న్యూఢిల్లీ, మే 4: చందమామ భూమి నుంచి నీటిని దొంగిలించాడు. అవును. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాళ్లు భూమిపై నుంచి చంద్రుడు దొంగిలించిన నీటివేనని చెప్తున్నారు. భూమిపై ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లను చంద్రుడు ఆకర్షించుకోవడం వల్ల అక్కడ నీరు తయారైందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది.
చంద్రుడు భూమి అయస్కాంత క్షేత్రానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇలా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వివరాలను సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో ప్రచురించారు.