ముంబై: దేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు కొనసాగుతున్నది. మహారాష్ట్రలో అధికార కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగా మంత్రికి నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరబ్ను (Anil Parab) నేడు విచారణకు రావాలని ఆదేశించింది. రత్నగిరిలోని బపోలి రిసార్ట్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ఈడీ.. కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో గతనెల 26న ముంబై సహా వివిధ ప్రాంతాల్లోని అనిల్ ఇండ్లతోపాటు, ఆయన సంబంధీకుల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. తాజాగా ఆయనకు సమన్లు జారీచేసింది.
కాగా, వివిధ కేసుల్లో ఇప్పటికే మహారష్ట్రకు చెందిన ఇద్దరు మంత్రులను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసుల్లో మంత్రి నవాబ్ మాలిక్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఊచలు లెక్కిస్తున్నారు.