న్యూఢిల్లీ : కింగ్ ఖాన్ షారుక్, దీపికా పదుకునే, జాన్ అబ్రహం ప్రధాన తారాగణంగా తెరకెక్కిన పఠాన్ మూవీ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. పఠాన్ కేవలం ఆరు రోజుల్లోనే 600 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచింది.
ఈ మూవీ సాంగ్స్కు యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూ వైరల్గా మారాయి. ఈ పాటలకు డ్యాన్స్ చేస్తూ ప్రజలు పలు సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ తల్లీ కొడుకు ఝూమే జో పఠాన్ సాంగ్కు మెస్మరైజింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బాల నటుడు రికీ పటేల్ అతడి తల్లి మింకు ఈ పెప్పీ సాంగ్కు డ్యాన్స్తో హోరెత్తించారు. ఈ వీడియోకు ఇన్స్టాగ్రాంలో 20 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. తల్లీకొడుకుల డ్యాన్స్కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఝూమే జో పఠాన్ సాంగ్ను అర్జిత్ సింగ్, సుకృతి కకర్, విశాల్, శేఖర్ ఆలపించగా కుమార్ ఈ పాటకు సాహిత్యం సమకూర్చారు.