న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను పాటియాలా హౌస్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరగా.. ఈ మేరకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో జుబేర్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది.
ఇదిలా ఉండగా.. మొహమ్మద్ జుబేర్ కేసులో ఢిల్లీ పోలీస్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అతుల్ శ్రీవాస్తవ నియామకమయ్యారు. హిందూ దేవతను అవమానిస్తూ నాలుగేళ్ల క్రితం ఆయన చేసిన ట్వీట్ చేశారనే కారణంతో జుబేర్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జుబేర్పై మరో మూడు కొత్త సెక్షన్లను చేర్చారు. సాక్షాలను నాశనం చేయడం, నేరపూరిత కుట్ర, ఫారిన్ గ్రాంట్స్ (రెగ్యులేషన్) చట్టం 2010లోని సెక్షన్లను చేర్చినట్లు పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు గాను జుబైర్ను ఢిల్లీ పోలీసులు జూలైన్ 27న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.