Mohamed Moizzu: మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు భారత్కు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఒక పక్క ఢిల్లీ-మాలెల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్కు శుభాకాంక్షలు చెబుతూ ఇరుదేశాల స్నేహ సంబంధాలను మొయిజ్జు ప్రస్తావించారు.
‘భారత రాష్ట్రపతి, ప్రధానిలకు అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు వేర్వేరుగా సందేశాలు పంపించారు. రానున్న కాలంలో భారత ప్రజలు శాంతి, అభివృద్ధి, సంపదతో తులతూగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని వందల ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని, పరస్పర గౌరవాన్ని, బంధాన్ని ఆయన గుర్తుచేసుకొన్నారు’ అని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, భారత మిత్రుడు ఇబ్రహీం సోలీ కూడా భారత్కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య విడదీయరాని బంధం ఉందన్నారు. భవిష్యత్తులో ఇది మరింత బలపడాలని ఆయన ఎక్స్లో పోస్టు చేసిన సందేశంలో ఆకాంక్షించారు. ఇటీవల మాల్దీవ్స్కు చెందిన ముగ్గురు మంత్రులు మన ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, భారత సైనిక దళాలను వెనక్కి తీసుకోవాలని అధ్యక్షుడు మొయిజ్జు డిమాండ్ చేయడం వివాదాస్పదమయ్యాయి.