అహ్మదాబాద్: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ (100) అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఆమెకు ఆరోగ్య సంబంధ సమస్యలు తలెత్తడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా కార్డియాలజీ, రిసెర్చ్ సెంటర్ దవాఖానలో చేర్చారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని దవాఖాన వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ 13న హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఆమె కోలుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ ఆకాంక్షించారు.