గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్లో తన ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అయితే ఆయన కొద్దిదూరం పోలింగ్ కేంద్రానికి నడుచుకొంటూ రావడం, ఇదే సమయంలో దారిపొడవుగా ప్రజలకు అభివాదం చేసుకొంటూ ముందుకు వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ వేళ ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ‘రోడ్షో’ చేపట్టారని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ నేతలు గతంలో కూడా పలుమార్లు కోడ్ ఉల్లంఘించినా ఎన్నికల సంఘం మౌనం వహించిందని, చర్యలు తీసుకొనేందుకు భయపడుతున్నదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. ప్రధాని మోదీని ఈసీ ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నదని, అందుకే ఆయన పోలింగ్ రోజున నిబంధనలకు విరుద్ధంగా రోడ్షో చేయగలిగారని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ పేర్కొన్నారు.