రాష్ర్టాల విభజనకు ప్రధాని యోచన..
కర్ణాటక మంత్రి ఉమేశ్ కత్తి వ్యాఖ్యలు
బెంగళూరు, జూన్ 24: కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఉమేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశాన్ని 50 రాష్ర్టాలుగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కర్ణాటక కూడా రెండుగా విడిపోయి, కొత్తగా ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్నారు.
ఈ విషయంపై మోదీ లోతుగా ఆలోచన చేస్తున్నట్టు తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ కర్ణాటకను 2, మహారాష్ట్రను 3, ఉత్తరప్రదేశ్ను 4 రాష్ర్టాలుగా విభజించాలని నిర్ణయించారని వ్యాఖ్యానించారు.