లక్నో: ప్రధాని మోదీ తమను, ఓటర్లను మోసం చేశారని, అందుకే ఎన్డీఏ కూటమిని వీడి, సమాజ్వాదీ పార్టీతో జట్టుకట్టినట్టు ఆ పార్టీ నేత ఓపీ రాజ్భర్ చెప్పారు. బీజేపీ ప్రజలకు ముఖ్యంగా దళితులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మరచిపోయిందని మండిపడ్డారు. యోగి పాలనలో అట్టడుగు వర్గాలకు జరుగుతున్న అన్యాయాల కారణంగానే తాము సర్కారు నుంచి బయటకు వచ్చామని చెప్పారు.