న్యూఢిల్లీ: భారత మాజీ డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీ 94వ పుట్టిన రోజు ఇవాళ. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు.. అద్వానీ ఇంటికి వెళ్లి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపారు. అద్వానీతో బర్త్డే కేక్ కట్ చేయించారు. అద్వానీకి సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. సంస్కృతి పరిరక్షణలో, ప్రజల్ని చైతన్య పరచడంలో ఈ దేశం అద్వానీకి రుణపడి ఉన్నట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు. ఇవాళ పుట్టినరోజు వేడుక సందర్భంగా.. అద్వానీ ఇంటి లాన్లో ఆయనతో కలిసి ప్రధాని మోదీ నడిచారు. అద్వానీ ఓ స్పూర్తిదాయకమైన, గౌరవప్రదమైన నేత అని రక్షణ మంత్రి రాజ్నాథ్ అన్నారు.