PM Narendra Modi : నేపాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చూస్తుంటే తన మనసు చివుక్కుమంటోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అగ్నిగుండంలా మారిన హిమాలయ దేశంలో సుస్థిరత, శాంతి, సంపద.. వంటివి భారత్ ప్రధాన ప్రాధామ్యాలు అని మోడీ తెలిపారు.
‘నేపాల్లో హింసను చూసి మనసు తరుక్కుపోతోంది. ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోడం చాలా బాధేస్తోంది. నేపాల్లో సుస్థిరత, శాంతి, సంపద.. వంటివి భారత్ ప్రథమ ప్రాధాన్యాలు. ఆ దేశంలోని సోదరులు, సోదరీమణులు.. అందరిని శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మోడీ ఎక్స్ పోస్ట్లో వెల్లడించారు. మంగళవారం ఉదయం ప్రధాని వరదలకు తీవ్రంగా నష్టపోయిన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భద్రతా సమావేశంలో క్యాబినెట్ కమిటీ నేపాల్లోని పరిస్థితులను చర్చించిందని మోడీ తెలిపారు.
On my return from Himachal Pradesh and Punjab today, a meeting of the Cabinet Committee on Security discussed the developments in Nepal. The violence in Nepal is heart-rending. I am anguished that many young people have lost their lives. The stability, peace and prosperity of…
— Narendra Modi (@narendramodi) September 9, 2025
దేశంలో అవినీతి, బంధుప్రీతి, సోషల్ మీడియాపై నిషేధం.. ఈ మూడు కారణాల వల్ల నేపాల్ యువత భగ్గుమంది. సెప్టెంబర్ 8 నుంచి వారు ఆందోళనలకు దిగారు. మంగళవారం జరిగిన అల్లర్లలో, హింసలో.. 22 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కిన యువత పార్లమెంట్, అధ్యక్ష భవనంతోపాటు సుప్రీంకోర్టును కూడా తగలబెట్టారు. దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) తన పదివికి రాజీనామా చేశారు.