Gujarat Poll | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతున్న సందర్భంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా.. ప్రధాని మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మోదీ ఓ చావుల వ్యాపారి అని సంభోదించాడు. గోద్రాలో అంత్యక్రియల ఊరేగింపు చేయబోతున్నాడని విమర్శించాడు. ఇప్పటికే మధుసూదన్ మిస్త్రీ, మల్లిఖార్జున ఖర్గేలు మోదీపై విరుచుకుపడ్డారు. కాగా, 15 ఏండ్ల క్రితమే మోదీని చావుల వ్యాపారి అని సోనియాగాంధీ పిలిచారు.
గుజరాత్లో రెండో దశ పోలింగ్ సందర్భంగా మరోసారి ‘మరణాల వ్యాపారి’ అనే నినాదం మార్మోగుతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఓ చావుల వ్యాపారి అని శంకర్ సింగ్ వాఘేలా వ్యాఖ్యానించాడు. గోద్రాలో అంత్యక్రియల ఊరేగింపు చేయబోతున్నాడని ఆరోపించాడు. ఈసారి గుజరాత్లో బీజేపీ ఓడిపోతుందని వాఘేలా పేర్కొన్నారు. గత 27 ఏండ్లుగా గుజరాత్ ప్రజలను హిందూ, ముస్లిం అంటూ
విడదీసి రాజకీయాలు చేసిందని మండిపడ్డారు.
శంకర్సింగ్ వాఘేలా ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు. అయితే, ఈయన కుమారుడు మహేంద్రసింగ్ వాఘేలా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నాడు. తన కుమారుడి గెలుపు కోసమే వాఘేలా ఇలా మోదీపై వ్యాఖ్యలు చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, మోదీని చావుల వ్యాపారి అని 2007 లోనే సోనియాగాంధీ అభివర్ణించారు. మరోవైపు గుజరాత్ ఎన్నికల్లో మోదీకి తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రీ అనగా.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు
మల్లికార్జున్ ఖర్గే మోదీకి రావణుడి సారుప్యతను ఉపయోగించారు.