భోపాల్: హోటల్లో భోజనానికి వచ్చి వెళ్తున్న జంటపై ఒక అల్లరిమూక దాడికి దిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. శుక్రవారం రాత్రి ఇండోర్లోని ఒక హోటల్కు ఒక వ్యక్తితో మహిళ వచ్చింది. వారిద్దరూ భోజనం చేసి బయటకు వచ్చిన వెంటనే 20 మంది దుండగులు వారిని చుట్టుముట్టి చితకబాదారు.
ఒక ముస్లింవి అయి ఉండి హిందూ వ్యక్తితో ఎలా హోటల్కు వచ్చావంటూ ఆమెను నిలదీసి దౌర్జన్యానికి దిగారు. తమను విడిచిపెట్టాలంటూ ఈ మహిళ చేతులు జోడించి వేడుకోవడం, అల్లరిమూకలోని ఒక వ్యక్తి వారికి ఇస్లాంలో లెక్చర్ ఇవ్వడం వీడియోలో కన్పించింది. కాగా, వారిని రక్షించడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించగా, గుంపులోని వాడు ఒకరిని కత్తితో పొడిచాడు. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురి పోలీసులు అరెస్టు చేశారు.