ముంబై: మరాఠీ పాటలు ప్లే చేయనందుకు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు ఒక హాటల్ మేనేజర్ను కొట్టారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. నవీ ముంబై వాషి ప్రాంతంలోని ఒక హోటల్లో బుధవారం రాత్రి పార్టీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో పాల్గొన్న కొందరు మహిళలు మరాఠీ పాటలు ప్లే చేయాలని హోటల్ మేనేజర్ను అడిగారు. అయితే పార్టీ బుకింగ్కు సంబంధించిన వివరాలు తనకు చూపించాలని అతడు అడిగాడు.
ఇంతలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు హాటల్ మేనేజర్ వద్దకు వచ్చారు. ‘ఇది మహారాష్ట్ర, ఇక్కడ మరాఠీ పాటలు మాత్రమే ప్లే చేయాలి’ అని అన్నారు. అయితే ఆ హోటల్ మేనేజర్ దీనికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఎంఎన్ఎస్ కార్యకర్తల్లో ఒకరు ఆ మేనేజర్ చెంప, ముఖంపై పలుమార్లు కొట్టాడు. అనంతరం మిగతా కార్యకర్తలు కూడా ఆ మేనేజర్పై దాడి చేశారు.
మరోవైపు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంఎన్ఎస్ కార్యకర్తల గుండాయిజంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఈ సంఘటనపై పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తున్నది.
Caught on cam: MNS workers 'thrash' Mumbai hotel manager allegedly for not playing Marathi songs.@Aruneel_S shares more details with @kritsween.#MNS #Maharashtra pic.twitter.com/4NYzqvr5CK
— TIMES NOW (@TimesNow) November 24, 2022