న్యూఢిల్లీ : ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు వస్త్రాలు ధరించిన సండ్ర వెంకటవీరయ్య, వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు. ఆకుపచ్చ రంగు తలపాగ ధరించి రైతులకు సంఘీభావం ప్రకటించారు. కావడికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వరికంకులను ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నలుపు రంగు వస్త్రాలు ధరించి దీక్షకు హాజరయ్యారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న టీఆర్ఎస్ దీక్షలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నలుపు రంగు వస్త్రాలు ధరించినఆయన, వరి కంకులతో సభాస్థలికి చేరుకున్నారు.#AntiFarmerBJP pic.twitter.com/E1hxJOLfIq
— Namasthe Telangana (@ntdailyonline) April 11, 2022