హైదరాబాద్: రూ.5 వందల నోట్లపై రాముడి ఫొటో ముద్రించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) డిమాండ్ చేశారు. అమెరికా, థాయ్లాండ్ సహా పలు యూరప్ దేశాల్లో ఇప్పటికే కరెన్సీ నోట్లపై (Currency Notes) హిందూ దేవుళ్ల ఫొటోలను ముద్రించారని చెప్పారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. రూ.5 వందల నోటుపై శ్రీరాముడి చిత్రాన్ని ముద్రించాలని వంద కోట్ల మంది హిందువులు డిమాండ్ చేస్తున్నారన్నారు.
దేశంలో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములను రిలీజ్ చేయాలని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో భారత్ను విడిచివెళ్లినవారి ఆస్తులను కాపాడేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ వక్ఫ్ చట్టం తెచ్చారని ఆరోపించారు. ఒక్క మహారాష్ట్రలోనే వక్ఫ్బోర్డు పేరుతో 10 లక్షల ఎకరాలు ఉన్నాయని చెప్పారు. ఈ భూములను మహారాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.