చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భటిండా నియోజకవర్గం నుంచి ఆమ్ఆద్మీ పార్టీ తరఫున గెలిచిన మహిళా ఎమ్మెల్యే రూపిందర్ కౌర్ రూబీ ఆ పార్టీకి రాజీనామా చేసి.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జీత్సింగ్ చన్ని, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల జంపింగ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రూపిందర్ కౌర్ రూబీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.