లక్నో, ఏప్రిల్ 8: వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపూ ఆశ్రమం మరో వివాదానికి కేంద్రమైంది. ఇటీవల అదృశ్యమైన 13 ఏండ్ల బాలిక మృతదేహం ఆశ్రమం ఆవరణలో పార్క్ చేసిన కారులో దొరికింది. ఈ ఆశ్రమం ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా కొత్వాలీ ప్రాంతంలో ఉంది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు. పార్క్ చేసి ఉన్న ఓ కారులో నుంచి చెడు వాసన వస్తుండటంతో ఆశ్రమం వాచ్మెన్ వెళ్లి చూడగా, అందులో బాలిక మృతదేహం కన్పించింది. ఆ బాలిక ఏప్రిల్ 5న కనిపించకుండా పోయింది. ఏప్రిల్ 7న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక ఇంటి ముందే ఆశ్రమం ఉంటుంది.