రాఖీ పండుగ రోజు దారుణం జరిగింది. అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్తున్న ఆ చెల్లెలి జీవితం అనుకోని మలుపు తిరిగింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్లిన మైనర్ బాలికను నలుగురు దుర్మార్గులు బలాత్కరించారు. ఈ ఘటన బిహార్లోని సివాన్ ప్రాంతంలో వెలుగు చూసింది. సోదరుడికి రాఖీ కట్టేందుకు బయటకు వెళ్లిన మైనర్ బాలికను దారి మధ్యలోనే నలుగురు యువకులు కిడ్నాప్ చేశారు.
రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి ఆమెను లాక్కెళ్లారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేస్తున్నా పట్టించుకోలేదు. అటుగా కారులో వెళ్తున్న ఒక డ్రైవర్కు ఆ అరుపులు వినిపించాయి. దాంతో అతను అనుమానంగా ఆ పొదలను సమీపించాడు. ఇది చూసిన నలుగురు యువకులు అక్కడి నుంచి పారిపోయారు.
యువతిని చూసిన కారు డ్రైవర్.. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని పవన్ కుమార్, అంకిత్ కుమార్, ఇమాముద్దీన్, దినేష్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, ఇంటరాగేట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు భగ్గుమన్నారు. మద్యంపై ఆంక్షలు విధించడంతో యువత డ్రగ్స్కు బానిసైందని, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వాళ్లు ఆరోపిస్తున్నారు.