న్యూఢిల్లీ, మే 24: సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కేంద్ర విదేశాంగ శాఖ శుక్రవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దౌత్య పాస్పోర్ట్ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని ఆయనను కోరింది.
కొన్ని రోజుల్లోగా స్పందన తెలపకపోతే.. పాస్పోర్ట్ను రద్దు చేస్తామని.. దాని వల్ల విమాన ప్రయాణానికి అనర్హులవుతారని తెలిపింది. తమ నోటీస్కు ప్రజ్వల్ స్పందించకపోతే.. ప్రస్తుతం ఆయన ఉన్న దేశంలోని పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకొని భారత్కు తరలించే అవకాశం ఉన్నదని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.