న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ భార్య పూనమ్ జైన్కు ఢిల్లీ కోర్టు శనివారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై పూనమ్కు రోజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఈ ఏడాది మేలో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు జైన్కు సంబంధించిన రూ 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అక్రమాస్తుల కేసులో అటాచ్ చేసింది.
సత్యేందర్ జైన్పై ఈడీ చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు మనీ ల్యాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ ప్రమేయానికి సంబంధించి సరైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇక ఈ కేసులో సత్యేందర్ జైన్ భార్యకు మధ్యంతర బెయిల్ జారీ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది. ఆగస్ట్ 20న కేసు తదుపరి విచారణకు చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.