బెంగళూరు, ఏప్రిల్ 22 : బాగలకోట జిల్లా ముధోళ్లో కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల మంత్రి మురుగేశ్ నిరాణికి చెందిన నిరాణి చక్కెర పరిశ్రమ సిబ్బంది నివాస సముదాయంపై ఈసీ అధి కారులు శుక్రవారం నిర్వహించిన దాడిలో 28 కిలోల వెండి దీపాలు లభించాయి.
సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు ఫ్లైయింగ్ స్కాడ్ ఈ దాడులు చేసింది. దీపాలున్న పెట్టెలపై మురుగేశ్ నిరాణి ఫొటో ముద్రించారు.