శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. శ్రీనగర్లోని హబ్బా కడల్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పంజాబ్కు చెందిన సిక్కు వలస కూలీ అమృత్పాల్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. అమృత్పాల్ పంజాబ్లోని అమృత్సర్ నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు. కాల్పుల్లో గాయపడిన రోహిత్ (25) కూడా అమృత్సర్కు చెందిన కూలీనేనని పేర్కొన్నారు