Bengaluru | బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి తల్లీ, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని నగావరా ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
బైక్పై వెళ్తున్న ఓ కుటుంబంపై మెట్రో పిల్లర్ పడటంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. 28 ఏళ్ల తేజశ్విని, ఆమె మూడేళ్ల కుమారుడు విహాన్ మృతి చెందారు. తేజశ్విని భర్త, కుమార్తె చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Karnataka | An under-construction metro pillar collapsed near Nagavara of the outer ring road in Bengaluru. Details awaited. pic.twitter.com/u4zRtncDBI
— ANI (@ANI) January 10, 2023
ఇవి కూడా చదవండి
మాస్కో – గోవా ఫ్లైట్కు బాంబు బెదిరింపు.. అత్యవసరంగా జామ్నగర్లో ల్యాండ్
రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో విమానాన్ని అత్యవసరం గుజరాత్లోని జామ్నగర్లో ల్యాండ్ చేశారు. 236 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది.. Read More>>
చేయిని నరికి తీసుకెళ్లారు.. హర్యానాలో ఘటన
హర్యానాలోని కురక్షేత్రలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి పై దాడి చేసి అతని చేతిని నరికివేశారు. జుగ్ను అనే వ్యక్తిని లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో చేర్పించారు. సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. నిందితుల్ని గుర్తించేందుకు.. Read More>>
గెట్ అవుట్ రవి.. తమిళనాడు గవర్నర్పై చెన్నైలో వెలసిన పోస్టర్లు
సీఎం స్టాలిన్ లేచి.. గవర్నర్ ఉపన్యాసం పక్కదారి పట్టించేలా ఉన్నదని అన్నారు. దీంతో ఆర్ఎన్ రవి తన ప్రసంగాన్ని ఆపేసి సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఈ వ్యవహారం షాక్కు గురిచేసింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడారు. ఆ ప్రసంగంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, ద్రవిడియన్ మాడల్ అన్న పాయింట్ను చదవకుండా వదిలేశారు. >> Read More