లక్నో: మతిస్థిమితంలేని కొడుకు చేతిలో ఓ వృద్ధుడు దారుణహత్యకు గురయ్యాడు. నిద్రిస్తున్న తండ్రి తలపై కొడుకు కర్రతో కొట్టి చంపేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాందా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాందా జిల్లాకు చెందిన రామ్భవన్ (70), రామ్కుమార్ (37) ఇద్దరూ తండ్రీ కొడుకులు. అయితే రామ్కుమార్కు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గాఢనిద్రలో ఉన్న తండ్రి రామ్భవన్పై రామ్కుమార్ కర్రతో దాడిచేశాడు.
తలపై బలంగా కొట్టి హతమార్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడికి గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారని, కేసు తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.