బల్రాంపూర్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బల్రాంపూర్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. చెవిటి, మూగ, మానసిక దివ్యాంగురాలిని .. కొందరు ఉన్మాదులు రేప్ చేశారు. ఆ అత్యాచార ఘటనకు చెందిన ఓ వీడియో రిలీజైంది. బైక్పై వెంటపడి మరీ ఆ మానసిక దివ్యాంగురాలిని గ్యాంగ్ రేప్ చేశారు. సీసీటీవీ ఆధారంగా ఇద్దర్ని గుర్తించి అరెస్టు చేశారు. ఇద్దరు నిందితుల్ని అంకుర్ వర్మ, హర్షిత్ పాండేగా గుర్తించారు. నేరానికి పాల్పడినట్లు ఆ ఇద్దరూ అంగీకరించినట్లు ఎస్పీ వికాశ్ కుమార్ తెలిపారు.
కామాంధులు వెంటబడుతున్న ఘటనకు చెందిన 16 సెకన్ల వీడియో ఫూటేజ్ను పోలీసులు రిలీజ్ చేశారు. పాదరక్షకాలు లేకుండానే ఆమె పరుగుతీస్తూ కనిపించింది. వెలుతురు మసకబారిన రూట్లో ఆమె పరుగెత్తింది. మోటరు సైకిళ్లపై కొందరు యువకులు ఆమెను వెంబడించారు. అయితే ఆ అమ్మాయికి చెందిన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్వాలి దేహత్ పోలీసు స్టేషన్లో కేసు బుక్ చేశారు. సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.
ఆ అమ్మాయి పరుగెత్తిన రూట్ను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా నిందితులను అంకుర్ వర్మ, హర్షిత్ పాండేలను గుర్తించారు. మేనమామ ఇంటి నుంచి స్వంత ఇంటికి వెళ్తున్న సమయంలో.. కొందరు వ్యక్తులు బైక్పై వచ్చి ఆ మహిళపై దాడికి పాల్పడ్డారు. నిర్మానుష ప్రదేశంలో ఆమెను రేప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించామని, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపినట్లు అదనపు ఎస్పీ విశాల్ పాండే తెలిపారు.
The spine-chilling visuals from Balrampur, Uttar Pradesh, would leave any conscientious person in a state of shock and dismay.
A 21-year-old specially-abled woman is seen on camera sprinting for her life while bike-borne men chase her down a deserted road. She passes right in… pic.twitter.com/vTnNoU9aol
— All India Trinamool Congress (@AITCofficial) August 13, 2025