న్యూఢిల్లీ: రొటీన్ డ్రెస్ కోడ్ను బ్రేక్ చేయాలని ఇద్దరు మగవారు భావించారు. ప్యాంటుకు బదులు ఆడవాళ్లు ధరించే స్కర్టులు వేసుకున్నారు. మెట్రో స్టేషన్తోపాటు మెట్రో రైలులో సందడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జండర్ డ్రెసింగ్కు సంబంధించి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న మూస ధోరణిపై చర్చకు ఇది దారి తీసింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు పురుషులు టీ షర్టులపై స్కర్టులు ధరించారు (Men Wearing Skirts). ఢిల్లీ మెట్రో స్టేషన్లో క్యాజువల్గా నడిచారు. మెట్రో రైలులో కూడా ప్రయాణించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
కాగా, సమీర్ ఖాన్ అనే యూజర్ ఈ వీడియో క్లిప్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘క్లౌట్ ఛేజర్స్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘ఢిల్లీ మెట్రోలో స్కర్ట్ ధరించండి’ అని ఆ వీడియోపై టెక్స్ట్లో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు భిన్నంగా స్పందించారు. స్కర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించిన ఆ ఇద్దరు మగవారికి చాలా మంది మద్దతు తెలిపారు. లేడీస్ దుస్తుల్లో వారి ఆత్మ విశ్వాసం, స్టైల్ను కొందరు ప్రశంసించారు. ‘ అందరూ ఇలా ఎందుకు ధరించకూడదు?’ అని ఒకరు ప్రశ్నించారు. ‘చొక్కాలు, ప్యాంట్లు తప్ప మరో రకం బట్టలు లేవని అబ్బాయిలు భావిస్తుంటారు. ఇకపై ఈ దుస్తులు కూడా ధరించి దీనిని సాధారణం చేద్దాం’ అని మరొకరు పిలుపునిచ్చారు.
మరోవైపు చాలా ఏళ్లుగా స్త్రీలు మగవారి దుస్తులు ధరిస్తుండగా, మగవారు కూడా చీరలు, స్కర్టులు వంటి మహిళల దుస్తులు ఎందుకు ధరించకూడదు? అన్న చర్చకు ఇది దారి తీసింది. మూస పద్ధతిలో కొనసాగుతున్న జండర్ వస్త్రధారణను బ్రేక్ చేయాల్సిన సమయం వచ్చిందని కొందరు పేర్కొన్నారు. అలాగే ఫ్యాషన్ మార్పును కోరుకునే హక్కు మగవారికి కూడా ఉందని మరి కొందరు సపోర్ట్ చేశారు.
అయితే కొంత మంది ఈ వస్త్రధారణను తప్పుపట్టారు. ‘మీలాంటి వారి వల్లే మగవారిలో పురుష లక్షణం అంతమైపోతున్నది’ అని ఒకరు విమర్శించారు. ‘లుంగీ ఓకే, కానీ స్కర్టులు బాగోలేదు. లుంగీ వంటి సౌకర్యం, ప్రయోజనాన్ని స్కర్టులు అందిస్తాయో లేదో అన్నది నాకు అర్థం కావడం లేదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, గత నెలలో కూడా స్కర్ట్ ధరించిన ఒక వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్లో క్యాట్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.
;