డెహ్రాడూన్: ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించారు (Men Forced Horse To Smoke). ఆ సిగరెట్ గంజాయితో కూడి ఉన్నట్లు కొందరు అనుమానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ గుర్రం యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిమాలయ పర్వాతాలున్న ఉత్తరాఖండ్లో ఈ సంఘటన జరిగింది. కేదార్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు, వారి సామగ్రిని మోసేందుకు గుర్రాలను వినియోగిస్తారు. అలా సేవలందించే ఒక గుర్రానికి దాని యజమాని మరో వ్యక్తి కలిసి బలవంతంగా సిగరెట్ తాగించారు. గుర్రం నోరు, ముక్కు రంధ్రాన్ని ఒక వ్యక్తి తన చేతితో మూశాడు. మరో వ్యక్తి సిగరెట్ను గుర్రం రెండో ముక్కు రంధ్రం వద్ద ఉంచి బలవంతంగా పొగ తాగించేందుకు ప్రయత్నించాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే జీవనాధారమైన గుర్రాన్ని దాని యజమాని, మరో వ్యక్తితో కలిసి ఇలా హింసించడాన్ని పలువురు నెటిజన్లు తప్పుపట్టారు. గంజాయితో కూడిన సిగరెట్ను గుర్రంతో బలవంతంగా స్మోక్ చేయించడంపై మండిపడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ రుద్రప్రయాగ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. కేదార్నాథ్కు 16 కిలోమీటర్ల ట్రెక్ మార్గంలోని చోటి లించోలి సమీపంలో, థారు క్యాంప్ వద్ద ఈ సంఘటన ఇటీవల జరిగినట్లు గుర్తించారు. జంతువుల పట్ల హింసకు సంబంధించిన కేసు నమోదు చేశారు. ఆ గుర్రం యజమాని రాకేష్ సింగ్ రావత్ను అరెస్ట్ చేసినట్లు సోన్ప్రయాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేష్ చంద్ర తెలిపారు. ఆ సిగరెట్లో గంజాయి ఉందా? అన్నదానిపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, ఏప్రిల్ 25న కేథార్నాథ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు గుర్రాల పట్ల క్రూర ప్రవర్తనకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి.
#Uttrakhand Some people are making a horse smoke weed forcefully at the trek of Kedarnath temple.@uttarakhandcops @DehradunPolice @RudraprayagPol @AshokKumar_IPS
should look into this matter and find the culprit behind thispic.twitter.com/yyX1BNMiLk— Himanshi Mehra 🔱 (@manshi_mehra_) June 23, 2023