న్యూఢిల్లీ, మే 6: వివాహం, గర్భధారణ విషయంలో దేశంలో మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. గర్భనిరోధక సాధనాల వాడకం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు స్త్రీల బాధ్యతేనని ఎక్కువ మంది పురుషులు భావించడమే దీనికి కారణం.
దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5) నివేదికలో ఈ ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. చట్టబద్ధ వయసు రాకుండానే చాలామంది బాలికలకు పెండ్లిళ్లు జరుగుతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. స్త్రీ, పురుషుల్లో ఊబకాయ సమస్య కూడా అంతకంతకూ పెరిగిపోతున్నదని వివరించింది.