న్యూఢిల్లీ: వ్యాపారవేత్త మెహుల్ చోక్సీపై ఇవాళ సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్సీఐ) నుంచి 22 కోట్లు తీసుకుని ఎగ్గొట్టినట్లు చోక్సీతో పాటు అతని కంపెనీ గీతాంజలి జెమ్స్పై ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సుమారు 13,500 కోట్లు టోకరా వేసిన కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీలు చోక్సీపై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. డోమినికా దేశంలో ప్రస్తుతం అతను అదుపులో ఉన్నాడు. చోక్సీ లాయర్ల వేసిన పిటిషన్ను డొమినికన్ కోర్టు విచారిస్తున్నది. 2018 జనవరి 4 నుంచి ఆంటిగ్వా, బార్బడోస్లో చోక్సీ తలదాచుకుంటున్నట్లు తెలిసింది. పీఎన్బీ కేసులో చోక్సీని ఇండియాకు రప్పించేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నాలు చేస్తోంది.