న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభాన్ని ఉదహరిస్తూ మోదీ సర్కార్పై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బుధవారం విరుచుకుపడ్డారు. పొరుగు దేశంలో తలెత్తిన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం భారత్కు మేలుకొలుపు వంటిదని వ్యాఖ్యానించారు. మైనారిటీలపై దాడుల పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలతో మనం మేలుకోవాలని, 2014 నుంచి భారత్లో మత వైషమ్యాలు పెచ్చుమీరి భయపూరిత వాతావరణం రాజ్యమేలుతోందని అన్నారు. అతి జాతీయతావాదం, మతాధిపత్య ధోరణి పెరుగుతున్నదని పేర్కొన్నారు. సామాజిక సామరస్యం, ఆర్ధిక భద్రతకు తూట్లు పొడుస్తున్నారని పీడీపీ చీఫ్ ట్వీట్ చేశారు.
విద్యార్ధులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు బనాయించడం కొనసాగిస్తే భారత్ పరిస్ధితి శ్రీలంక కంటే దిగజారుతుందని మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. 1948లో శ్రీలంక స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశం ప్రస్తుతం అతిపెద్ద ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్ధిక, రాజకీయ అస్ధిరత దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణలకు దారితీసింది.