శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో వాస్తవ పరిస్థితిని ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. తనను మళ్లీ గృహ నిర్బంధం చేశారని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. పుల్వామాలోని త్రాల్లో ఓ కుటుంబం పట్ల జవాన్ దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే తనను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. విదేశాల దౌత్యవేత్తలు.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసే పిక్నిక్ టూర్లు కాకుండా కశ్మీర్ యొక్క నిజమైన చిత్రాన్ని చూడాలన్నారు. కశ్మీర్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు.