షిల్లాంగ్: మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆయన శుక్రవారం కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాను ఐసొలేషన్లో ఉంటున్నానని సీఎం సంగ్మా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా లక్షణాలను గమనించి పరీక్ష చేయించుకోవాలని, సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) జాతీయ అధ్యక్షుడిగా ఈ వారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా థామస్ ఎ సంగ్మాను కూడా తిరిగి ఎన్నుకున్నట్లు పార్టీ తెలిపింది. “రెండు పోస్టులకు పోటీదారులెవరూ లేరు. అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు” అని పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అభయ కశ్యప్ తెలిపారు.